AP: రేపు మన్యం, అల్లూరి, కాకినాడ, కోనసీమ, ఏలూరు, ఎన్టీఆర్, సత్యసాయి జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA వెల్లడించింది. శని, ఆదివారాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. ఆదివారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్లరాదని సూచించింది. మరోవైపు రేపు 33 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని వివరించింది.