వాలంటీర్ల‌పై నేడు కీల‌క ప్ర‌క‌ట‌న‌?

85చూసినవారు
వాలంటీర్ల‌పై నేడు కీల‌క ప్ర‌క‌ట‌న‌?
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయాల దిశగా అడుగులు వేస్తోంది. ఎన్నికల హామీలపైన కూటమి సర్కార్ ఫోకస్ చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన నేడు ఏపీ మంత్రివర్గం సమావేశం కానుంది. ఇక, వాలంటీర్ల కొనసాగింపుతో పాటుగా వేతనాల చెల్లింపుపై మంత్రివర్గంలో తుది నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నారు. వాలంటీర్లను ఏ సంఖ్యలో వినియోగించుకోవాలి? ఏ విధులు అప్పగించాలనేది చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్