టీటీడీ మాజీ ఈవో ధర్మారెడ్డి కనబడటం లేదంటూ ఫ్లెక్సీ (వీడియో)

65చూసినవారు
తిరుమల లడ్డూ కల్తీ వివాదంలో అధికార ఎన్డీఏ కూటమికి, ప్రతిపక్ష వైసీపీ మధ్య పరస్పర విమర్శల పర్వం కొనసాగుతోంది. ఈ వివాదంలో ఏపీ బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి టీటీడీ మాజీ ఈవో ధర్మారెడ్డి కనబడటం లేదంటూ ఫ్లెక్సీ విడుదల చేయడం వైరల్‌గా మారింది. ధర్మారెడ్డి ఆచూకీ తెలిపిన వారికి రూ.1,116 బహుమతిని ఆయన ప్రకటించారు. దీనిపపై నవీన్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. లడ్డూ వివాదంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంటే.. మాజీ ఈవోలు కేఎస్ జవహర్ రెడ్డి, ధర్మారెడ్డి దొంగల్లా దాక్కున్నారని విమర్శించారు.

సంబంధిత పోస్ట్