సీఎం జగన్పై రాయి దాడి కేసులో తనను ఇరికించేందుకు కుట్ర జరిగిందని టీడీపీ నేత, విజయవాడ సెంట్రల్ అభ్యర్థి బోండా ఉమ ఆరోపించారు. తన ద్వారా చంద్రబాబు, నారా లోకేష్ను ఇబ్బంది పెట్టాలని చూశారని ఆయన మండిపడ్డారు. సీఎం జగన్పై రాయి దాడి కేసుల్లో అరెస్ట్ అయిన సతీష్, వేముల దుర్గారావు ఇద్దరూ వేర్వేరు అని ఆయన తేల్చి చెప్పారు. జగన్పై దాడి ఘటనలో వేముల దుర్గారావుకు ఎలాంటి సంబంధం లేదన్నారు. దుర్గారావు తన మనిషేనని బోండా ఉమ అన్నారు.