తొత్తడిలో బడ్డుకొండ ఎన్నికల ప్రచారం

78చూసినవారు
పూసపాటిరేగ మండలం తొత్తడి గ్రామంలో వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి బడ్డుకొండ అప్పలనాయుడు మంగళవారం ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా బడ్డుకొండ ఇంటింటికీ వెళ్లి వచ్చే ఎన్నికలలో తమకి ఓటు వేయాలని అభ్యర్థించారు. గడప గడపకూ సంక్షేమ పథకాలు అందించిన వైసిపిని ఆదరించాలని కోరారు. కార్యక్రమంలో జెసిఎస్ కన్వీనర్‌ మహంతి శ్రీనివాసరావు, నాయకులు మహంతి జనార్థన్, వైస్ ఎంపీపీలు చంటిరాజు, రమేష్ పాల్గొన్నారు.

ట్యాగ్స్ :