May 14, 2024, 12:05 IST/ముథోల్
ముథోల్
జైలులో ఉన్న హనుమాన్ స్వాములను కలిసిన బీజేపీ నేత
May 14, 2024, 12:05 IST
ఆదిలాబాద్ జిల్లా జైలులో ఉన్న హనుమాన్ స్వాములను, బీజేపీ కార్య కర్తలను బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మోహన్ రావు పటేల్ మంగళవారం ములాఖత్లో భాగంగా కలిశారు. భైంసా పట్టణానికి చెందిన హనుమాన్ స్వాములు, కార్య కర్తలను పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేసి జైలుకు పంపడం అన్యాయమన్నారు. స్వాములు, కార్యకర్తలతో మాట్లాడి వారికి మనోధైర్యాన్ని నింపి అండగా ఉంటానని హామీ ఇచ్చారు.