వైసిపి ఐదేళ్ల పాలనలో ఇసుక దోపిడీ: ఎమ్మెల్యే బేబీ నాయన

62చూసినవారు
ఇసుక దోపిడీకి అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం ఉచిత ఇసుక పంపిణీ అమలు చేస్తున్నట్లు ఎమ్మెల్యే బేబినాయన తెలిపారు. బొబ్బిలి గ్రోత్‌ సెంటర్లో ఉచిత ఇసుక కేంద్రాన్ని బుధవారం ఆయన పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసిపి ఐదేళ్ల పాలనలో ఇసుక దోపిడీ జరిగిందన్నారు. సామాన్యులకు ఇసుక దొరక్కపోవడంతో ఇళ్ల నిర్మాణాలకు తీవ్ర ఇబ్బందులు పడ్డారన్నారు. ఇసుక దోపిడీకి అడ్డుకట్ట వేయాలని తహశీల్దార్‌ త్రినాథరావును ఆదేశించారు.

సంబంధిత పోస్ట్