వైసీపీ నుంచి జనసేనలో చేరిక
విజయనగరం: బొండపల్లి మండల కో-కన్వీనర్ పైడిరాజు(జానీ) కొత్తపాలెం పంచాయతీ జీడిపాలెం గ్రామం మాజీ సర్పంచ్ దాట్ల సింహాచలం, వైసీపీ వార్డు మెంబర్లుతో పాటు 30 మంది ప్రజలు జనసేనలో చేరారు. నియోజకవర్గ జనసేన ఇంఛార్జి మర్రాపు సురేష్ ఆధ్వర్యంలో చేరగా ఆయన కండువాలు వేసి ఆహ్వానించారు. అనంతరం మాట్లాడుతూ..చంద్రబాబు, పవన్ కళ్యాణ్ నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి చెందడం ఖాయమని అన్నారు.