జమ్ములో గుర్తుతెలియని వ్యక్తి మృతి

22769చూసినవారు
జమ్ములో గుర్తుతెలియని వ్యక్తి మృతి
విజయనగరం: గుర్ల మండలంలోని జమ్ము గ్రామంలో రైలు పట్టాలపై గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందినట్లు రైల్వే హెచ్‌సీ చక్రధర్‌ తెలిపారు. రైల్వే హెచ్‌సీ వివరాల ప్రకారం.. మృతుడి వయసు 50ఏళ్లు ఉంటుందని, జేబులో హావ్‌డా నుంచి విజయవాడకు వెళ్తున్నట్లు టికెట్‌ ఉందన్నారు. 3రోజుల కిందట మరణించి ఉంటాడని భావిస్తున్నామన్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని చీపురుపల్లి సీహెచ్‌సీకి తరలించామని ఆయన పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్