Mar 31, 2024, 17:03 IST/ఖానాపూర్
ఖానాపూర్
ఎండల తీవ్రత పెరుగుతుంది
Mar 31, 2024, 17:03 IST
ఖానాపూర్ నియోజకవర్గంలో ఎండల తీవ్రత క్రమంగా పెరుగుతోందని అధికారులు స్పష్టం చేశారు. నియోజకవర్గంలోని పలు మండలాల్లో ఆదివారం మధ్యాహ్నం రెండు గంటలకు 42 డిగ్రీల పగటి ఉష్ణోగ్రత నమోదయిందని వారు స్పష్టం చేశారు. ఇది గత సంవత్సర కంటే ఆరు డిగ్రీలు ఎక్కువగా ఉందన్నారు. రాబోయే నాలుగు రోజులపాటు నియోజకవర్గంలోని పలు మండలాల్లో పగటి ఉష్ణోగ్రతలు 40 నుంచి 43 డిగ్రీల మధ్య నమోదు కావచ్చని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.