నవధాన్యాలు నేలకు ఉపయోగకరం

781చూసినవారు
నవధాన్యాలు నేలకు ఉపయోగకరం
పార్వతీపురం మన్యం జిల్లా మక్కువ మండలం చప్పబుచ్చిం పేట రైతు కేంద్రంలో నవధాన్యాలు సాగు నేలతల్లికి బాగు కార్యక్రమంలో భాగంగా మండల వ్యవసాయ అధికారి బి. శ్రీనివాసరావు ఆధ్వర్యంలో రైతులకు నవధాన్య కిట్లు పంపిణీ చేయడం జరిగింది. నవధాన్యాలు సాగు చేయడం నేల సారం పెరిగుతుందని, చీడ పీడల నుండి పంట తట్టుకుని అధిక దిగుబడులు సాధించవచ్చన్నారు. నేటి కాలంలో రైతులు నవధాన్యాల సాగు చేయాలని, పెట్టుబడులు తగ్గించుకోవాలని అన్నారు. ఈ నవధాన్యాలు ఆర్బికే కేంద్రంలో అందుబాటులో ఉంటాయని, కావున రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో విఎఎ వెన్నెల, ప్రకృతి వ్యవసాయ సీఆర్పీలు నలితం గంగరాజు, ఉర్లక నాగార్జున, గులివిందల అశోక్, వెంకటరమణ, రైతులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్