దేశంలోనే సంక్షేమ పాలనకు శ్రీకారం చుట్టింది- ఎన్టీఆర్

85చూసినవారు
దేశంలోనే సంక్షేమ పాలనకు శ్రీకారం చుట్టింది- ఎన్టీఆర్
సంతకవిటి మండలంలోని మామిడిపల్లి గ్రామంలో మంగళవారం ఎన్టీఆర్ జయంతి వేడుకలను తూర్పుకాపు కార్పొరేషన్ మాజీ చైర్మన్ కోళ్ళ అప్పలనాయుడు ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులతో కలిసి ఘనంగా నిర్వహించారు. క్రమశిక్షణ, పట్టుదల, చిత్తశుద్ధి, ప్రజలకు మంచి చేయాలనే తపనే ఎన్టీఆర్ ను మహానాయకునిగా తీర్చిదిద్దాయని అన్నారు, సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్లు అని నమ్మిన ఎన్టీఆర్ దేశంలోనే మొదటిసారిగా సంక్షేమపాలనకు శ్రీకారం చుట్టారన్నారు.

సంబంధిత పోస్ట్