తమ సమస్యలు పరిష్కరించాలంటూ ఎమ్మెల్యేకి వినతి

80చూసినవారు
తమ సమస్యలు పరిష్కరించాలంటూ ఎమ్మెల్యేకి వినతి
ఎల్ కోట మండలం గొల్లలపాలెం కు చెందిన ప్రజలు ఎల్ కోటలో ఎమ్మెల్యే లలిత కుమారి స్వగృహంలో తమ సమస్యల పరిష్కరించాలంటూ ఆదివారం వినతి పత్రం అందజేశారు. గ్రామంలో జలజీవన్ మిషన్ పథకం ద్వారా ఇంటింటికి కుళాయిలు ఏర్పాటు చేయాలని, అంగన్వాడి భవన నిర్మాణం చేపట్టాలని, ప్రభుత్వ పాఠశాలకు ప్రహరీ గోడ నిర్మించాలనే తదితర సమస్యలపై ఎమ్మెల్యేకు విన్నవించారు. కాగా ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించినట్లు గ్రామస్తులు తెలిపారు.

సంబంధిత పోస్ట్