గోడిచర్ల జాతీయ రహదారి పై రోడ్డు ప్రమాదం, వ్యక్తి దుర్మరణం

559చూసినవారు
గోడిచర్ల జాతీయ రహదారి పై రోడ్డు ప్రమాదం, వ్యక్తి దుర్మరణం
నక్కపల్లి మండలం గోడిచర్ల జాతీయ రహదారిపై గుర్తు తెలియని వాహనం ఢీకొని మంగళవారం అర్ధరాత్రి 12. 30 నిమిషాలకు ఒక వ్యక్తి మృతి చెందాడు. విశాఖపట్నం వైపు బైక్ పై వెళుతున్న ఒక వ్యక్తి గోడిచర్ల జాతీయ రహదారిపై తీవ్ర గాయాలతో పడి ఉన్నాడు. 108 సిబ్బందికి స్థానికులు ఫిర్యాదు చేయడంతో సిబ్బంది అక్కడికి వెళ్లేసరికి ఆ వ్యక్తి మృతి చెంది ఉన్నాడు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్