విస్తృతంగా వాహనాల తనిఖీలు

1061చూసినవారు
నర్సీపట్నంలో ఎన్నికల కమిషన్ ఏర్పాటు చేసిన స్క్వాడ్ బృందాలు బుధవారం పెద్దబొడ్డేపల్లి శివారులలో తనిఖీలు చేపట్టాయి. స్క్వాడ్ అధికారిణి ఢిల్లీశ్వరి ఆధ్వర్యంలో పోలీసులు పలు వాహనాలను తనిఖీ చేశారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల ప్రకారం తనిఖీ చేస్తున్నామని స్క్వాడ్ అధికారిణి ఢిల్లేశ్వరి తెలిపారు. నగదు, మద్యం తదితర వస్తువుల అక్రమ రవాణాపై దృష్టి పెడతామన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్