పోలింగ్ నిర్వహణపై అవగాహన
నర్సీపట్నం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బుధవారం సాయంత్రం ఎన్నికల రిటర్నింగ్ అధికారి జయరాం వివిధ సెక్టార్ అధికారులతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలింగ్ ముందు రోజున ప్రతి ఒక్కరూ కచ్చితంగా తమ పరిధిలో ఉన్న పోలింగ్ స్టేషన్లను పరిశీలించాలని సూచించారు. ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఓటు వేసే విధంగా అధికారులందరూ సమన్వయంతో పనిచేయాలని పేర్కొన్నారు.