
నర్సీపట్నం: కార్పెంటర్స్ డే సందర్భంగా ర్యాలీ
నర్సీపట్నం మున్సిపాలిటీలోని స్థానిక అభిద్ సెంటర్ నుండి ఆర్డీఓ కార్యాలయం వరకు గురువారం కార్పెంటర్స్ డే సందర్భంగా ర్యాలీ నిర్వహించారు. అనంతరం స్థానిక ఆర్డిఓ కార్యాలయం ఏవో సూర్యనారాయణకు వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వం నుండి కార్పెంటర్స్ కు ఎటువంటి ఆర్థిక సహాయం అందట్లేదని, 200 యూనిట్లు కరెంటు ఉచితంగా ఇవ్వాలని, అంగవైకల్యం కలిగిన వారికి భీమా సౌకర్యం పింఛన్లు మంజూరు చేయాలని కోరారు.