విశాఖలోని రుషికొండపై నిర్మించిన భవనాలను ఏ విధంగా వినియోగించాలన్న అంశంపై త్వరలోనే సీఎం జగన్ నిర్ణయం తీసుకుంటారని రాష్ట్ర మంత్రి గుడివాడ అమర్నాథ్ వెల్లడించారు. విశాఖలో ఆయన గురువారం మీడియాతో మాట్లాడారు. రుషికొండపై 9. 88ఎకరాలలో టూరిజం ప్రాజెక్టు నిర్మించామని, గతంలో ఈ ప్రాంతంలో ఉన్న హరిత రిసార్ట్స్ స్థానే నిర్మాణాలు జరిగాయన్నారు. సుందరమైననగరానికి తగ్గట్టుగా భవన నిర్మాణాలు సాగాయని అమర్నాథ్ చెప్పారు.