నవరత్నాలతో పేదలకు భరోసా
By విక్కీ 1527చూసినవారునవరత్నాలు పేదలకు వరంగా మారాయని ఎంపీ, విశాఖ తూర్పు వైసీపీ సమన్వయకర్త ఎంవీవీసత్యనారాయణ అన్నారు. ఆయన నిర్వహిస్తున్న పాదయాత్ర గురువారం నాటికి 54వ రోజుకు చేరుకుంది. హెచ్బీకాలనీ, చాకలిగెడ్డ ప్రాంతాల్లో కార్పొరేటర్ లక్ష్మీ అప్పారావుతో కలిసిన ఆయన పర్యటించారు. ప్రజలను ఆయన ఆత్మీయంగా పలకరించారు. సమస్యలు తెలుసుకున్నారు. వచ్చే ఎన్నికల్లో విజయం చేకూర్చాలని అభ్యర్థించారు.