పెద్దేరు ద్వారా 401 క్యూసెక్కుల నీరు విడుదల

66చూసినవారు
పెద్దేరు ద్వారా 401 క్యూసెక్కుల నీరు విడుదల
మాడుగుల మండలం పెద్దేరు జలాశయం ద్వారా సోమవారం ఉదయం 401 క్యూసెక్కుల నీరు విడుదల చేసినట్టు పెద్దేరు ఏఈ సుధాకర్ రెడ్డి తెలిపారు. జలాశయం మొత్తం నీటిమట్టం 137 మీటర్ల గాక సోమవారం ఉదయానికి 136. 45 కి చేరుకోవడంతో పాటు జలాశయంలోకి 182 చేరిందన్నారు. అలాగే 74 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. దీంతో స్పిల్ వే ద్వారా 281 క్యూసెక్కులు, రాచకట్టు ఆర్ఎంసి ద్వారా 60 క్యూసెక్కులు చొప్పున నీరు విడుదల చేసినట్టు తెలిపారు.

సంబంధిత పోస్ట్