పదవ తరగతి పరీక్షల నేపథ్యంలో మాధవధార, ఎన్ ఏడి కొత్త రోడ్, కంచరపాలెం దగ్గర ప్రాంతాల్లో వున్న పరీక్ష కేంద్రానికి విద్యార్థులు సోమవారం గంట ముందే చేరుకున్నారు. ఇప్పటికే కేంద్రాలకు చేరుకునే విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు పోలీసులు అన్ని విధాల చర్యలు చేపట్టారు. కేంద్రాలకు చేరుకున్న విద్యార్థులను పోలీసులు తనిఖీచేశారు. కేంద్రంలో స్మార్ట్ వాచ్ మొబైల్ ఫోన్ లు నిషేధమని పోలీసులు సూచిస్తున్నారు.