ఎంవివి ప్రసాద్ ఆద్వర్యంలో మాజీ ఎంపిపి టిడిపి లో చేరిక
తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి యం. వి. వి ప్రసాద్ ఆధ్వర్యంలో, అల్లూరి జిల్లా కొయ్యూరు మండల మాజీ యం. పి. పి లోతా దేముడమ్మ తెలుగుదేశం పార్టీ లో చేరారు.అంతాడ, బంగారంపేట, పంచాయతీ లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో భాగంగా మాజీ యం. పి. పి లోతా దేముడమ్మ తో పాటు 500 మంది, గ్రామస్థులు తెలుగుదేశం పార్టీ లో చేరారు. కూటమి అభ్యర్థిలకు ఓటు వేసి గెలిపించాలని, చంద్రబాబు నాయుడుని ముఖ్యమంత్రి చేయాలని ఇంటింటా ప్రచారం చేశారు.