
పెందుర్తి: సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేయాలి
సమస్యల పరిష్కారమే లక్ష్యంగా అధికారులు పనిచేయాలని పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు సూచించారు శుక్రవారం పెందుర్తిలో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల నుంచి వచ్చిన ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ పీలా శ్రీనివాసరావు పాల్గొన్నారు