22న వైభవంగా స్వాతి హోమం
ఈనెల 22వ తేదీన శ్రీ స్వామివారి స్వాతి నక్షత్రం, నరసింహ జయంతిని అత్యంత వైభవంగా నిర్వహించనున్న సింహాచలం దేవస్థానం ఈవో ఎస్ శ్రీనివాసమూర్తి తెలిపారు. స్వామివారి స్వాతి నక్షత్రం నరసింహ జయంతి ఒకే రోజున వచ్చినందున వైదిక కమిటీ వారు నిర్ణయించిన ప్రకారం పాత కళ్యాణ గ్రౌండ్లో స్వాతి హోమం నిర్వహించేందుకు ఏర్పాట్ల విషయమై మంగళవారం అధికారులతో ఆయన చర్చించారు.