ఫార్మా ప్ర‌మాదంపై విచార‌ణ జ‌ర‌పాలి

74చూసినవారు
పెందుర్తి నియోజ‌క‌వ‌ర్గం పరవాడ మండలం లోఫార్మసిటీ లో గల ఆల్కలీ మెటల్ పరిశ్రమ, ఎక్టోరియా పరిశ్రమల్లో ఆదివారం జరిగిన ప్రమాదంపై సమగ్ర విచారణ చేసి చర్యలు తీసుకోవాలని సిఐటియు ఆధ్వర్యంలో పరవాడ ఫార్మసిటీలో సోమవారం నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు గౌరవ అధ్యక్షులు గని శెట్టి సత్యనారాయణ మాట్లాడుతూభద్రత ప్రమాణాలు పాటించకపోవడం వలన ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని ఆరోపించారు.