విశాఖ: జామియా మసీద్ పునర్నిర్మాణానికి శ్రీకారం

66చూసినవారు
విశాఖ దక్షిణ నియోజకవర్గంలోని చెంగలరావు పేటలో శుక్రవారం జామియా మసీద్ పునర్నిర్మాణ కార్యక్రమంలో ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్‌ పాల్గొన్నారు. అనంతరం ముస్లిం సోదరులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా వంశీకృష్ణకు జామియా మసీదు కమిటీ ఘనంగా సత్కరించింది. మసీదు నిర్మాణంలో తన వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో మసీద్ కమిటీ పెద్దలు, కూటమి నేతలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్