జనసేన పార్టీ నుంచి వైసీపీలో చేరికలు

64చూసినవారు
జనసేన పార్టీ నుంచి వైసీపీలో చేరికలు
మునగపాక యాతపేటలోని జనసేన పార్టీకి చెందిన పలు కుటుంబాలు గురువారం వైసీపీలో చేరాయి. ఈ సందర్భంగా యలమంచిలి వైసీపీ అభ్యర్థి యూవీ. రమణమూర్తిరాజు వారికి పార్టీ కండువా వేసి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ. పార్టీలో చేరిన వారికి సముచిత స్థానం ఉంటుందన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ విజయానికి కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ డీసీసీబీ ఛైర్మన్ యు. సుకుమార్ వర్మ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్