ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2024 అసెంబ్లీ ఎన్నికలలో కడప జిల్లా పులివెందుల నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. జగన్ పులివెందుల అసెంబ్లీ నుంచి పోటీ చేయడం ఇది మూడోసారి. గతంలో 2014, 2019 ఎన్నికలలో వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. 2009లో తొలిసారి కాంగ్రెస్ పార్టీ నుంచి కడప పార్లమెంటు స్థానంలో పోటీ చేసి గెలిచారు.