సీఎం జగన్ రేపు మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. ఉ.10 గం.కు నరసాపురం పార్లమెంట్ పరిధిలోని స్టీమెర్ సెంటర్లో జరిగే ప్రచార సభలో పాల్గొంటారు. అనంతరం మ. 2.30 గం.కు నరసరావుపేట పార్లమెంట్ పరిధిలోని పెదకూరపాడు నియోజకవర్గంలో క్రోసూరు సెంటర్లో జరిగే సభలో పాల్గొని ప్రసంగిస్తారు. ఆ తర్వాత మ.3 గం.కు ఒంగోలు పార్లమెంట్ పరిధిలోని కనిగిరి పామూరు బస్టాండ్ సెంటర్లో జరిగే ప్రచార సభలో పాల్గొంటారు.