సీఎం జగన్ పై జరిగిన దాడి ప్రజాస్వామ్యానికే మాయని మచ్చ

78చూసినవారు
రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ పై దాడి ప్రజాస్వామ్యానికే మాయని మచ్చ అని రాష్ట్రప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరి ప్రసాదరాజు అన్నారు. బస్సుయాత్రకు రోజురోజుకూ పెరుగుతున్న ప్రజాదరణ చూసిఓర్వలేక ఓటమి భయంతోనే ఇలాంటి దాడులకు పాల్పడుతున్నారని అన్నారు. కేంద్రం తగిన చర్యలు చేపట్టి సీఎం జగన్ కు భద్రత పెంచాలి. ఆదివారం నర్సాపురం మండలం మర్రితిప్ప గ్రామంలో ఎన్నికల ప్రచారం లో నల్ల బ్యాడ్జిలతో శాంతియుతంగా నిరసన తెలిపారు.