మధ్య తరగతి వర్గాలకు అండగా టిడిపి మేనిఫెస్టో: మాజీ ఎమ్మెల్యే

76చూసినవారు
మధ్యతరగతి వర్గాలకు అండగా టిడిపి మేనిఫెస్టో ఉందని టిడిపి-జనసేన-బిజెపి ఉమ్మడి అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. మంగళవారం తణుకులో పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ముఖ్యంగా బీసీలకు మేనిఫెస్టోలో పెద్దపీట వేశారని అన్నారు. నిరుద్యోగులకు అండగా అధికారంలోకి రాగానే మెగా డీఎస్సీపై మొదటి సంతకం చేస్తారని చెప్పారు.