టీడీపీ కంచుకోటను బద్దలు కొట్టుకుని వైసీపీ రాష్ట్రంలో 175కు 175 స్థానాల్లో విజయం సాధిస్తుందని, ఆ పార్టీ ఉండి నియోజకవర్గ అభ్యర్థి పీవీఎల్ నరసింహారాజు ధీమా వ్యక్తం చేశారు. బుధవారం పాలకోడేరులో నరసాపురం ఎంపీ అభ్యర్థి ఉమాబాలతో కలిసి ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఉండి నియోజకవర్గానికి ఎవరు ఎమ్మెల్యే అభ్యర్థులో తెలియని పరిస్థితిలో కూటమి అభ్యర్థులు ఉన్నారని ఎద్దేవా చేశారు.