పెనుమంట్ర మండలం మాముడూరు గ్రామంలో ఆదివారం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఇంటింటికి పితాని పాదయాత్ర కార్యక్రమంలో రాష్ట్ర మాజీ మంత్రి పితాని సత్యనారాయణ పాల్గొన్నారు. గ్రామానికి విచ్చేసిన పితాని సత్యనారాయణకు మహిళలు చామంతి పూలు జల్లుతూ ఘన స్వాగతం పలికారు. పితాని సత్యనారాయణ గ్రామంలో ఇంటింటికి పర్యటిస్తూ వారి సమస్యలను, గ్రామ సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు.