దక్షిణాఫ్రికాలోని కలహరి టైగర్ రిజర్వ్ నుంచి తెప్పించిన ఆడ చిరుత గామిని ఇవాళ ఐదు పిల్లలకు జన్మనిచ్చింది. మధ్యప్రదేశ్లోని కునో నేషనల్ పార్కులో ఈ చిరుత కూనలు జన్మించాయి. దాంతో భారత్లో జన్మించిన విదేశీ చిరుత కూనల సంఖ్య 13కు పెరిగింది. గామిని భారత్లో ప్రసవించిన నాలుగో విదేశీ చిరుతగా, తొలి దక్షిణాఫ్రికా చిరుతగా గుర్తింపు పొందింది.