వినాయకుడిని దర్శించుకున్న శాసనమండలి చైర్మన్ మోషేన్ రాజు

57చూసినవారు
వినాయకుడిని దర్శించుకున్న శాసనమండలి చైర్మన్ మోషేన్ రాజు
భీమవరం మావుళ్ళమ్మ అమ్మవారి దేవస్థానంలోని ఉపాలయం ఐన విఘ్నేశ్వర స్వామి ఆలయంలో గణపతి నవరాత్రుల మహోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. శనివారం శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషేన్ రాజు, విఘ్నేశ్వర స్వామి ని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆలయ సహాయ కమిషనర్ కార్యనిర్వహణాధికారి బుద్ధ మహాలక్ష్మి నగేష్, మోషేన్ రాజుకు శేషవస్త్రం అందచేసారు. ఉప ప్రధాన అర్చకులు కొప్పేశ్వరరావు పూజా కార్యక్రమాలు నిర్వహించారు.

సంబంధిత పోస్ట్