
భీమవరం: సంక్షేమం అభివృద్ధి టీడీపీ లక్ష్యం
కోటి మందికిపైగా సభ్యత్వాలు కలిగిన అతిపెద్ద రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తుందని టీడీపీ జిల్లా అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి అన్నారు. సోమవారం భీమవరం పార్టీ కార్యాలయంలో టీడీపీ సభ్యత్వ ఐడి కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు. అలాగే సభ్యత్వం ఉన్న కార్యకర్త మరణిస్తే ఆ కుటుంబానికి 5 లక్షల బీమా వర్తిస్తుందని అన్నారు.