తణుకు: ఏపీ ప్రభుత్వం ఆదేశాలతో తక్కువ ధరలకు నాణ్యమైన సరుకులు

76చూసినవారు
తణుకు: ఏపీ ప్రభుత్వం ఆదేశాలతో తక్కువ ధరలకు నాణ్యమైన సరుకులు
మార్కెట్ ధరల కంటే తక్కువ ధరలకే వంటనూనెలు, ఉల్లిపాయలు, టమోటాలు వినియోగదారులకు అందజేయడం జరుగుతుందని జిల్లా జాయింట్ కలెక్టర్ టి. రాహుల్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం తణుకు పట్టణంలోని చాంబర్ ఆఫ్ కామర్స్ వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్ ను జాయింట్ కలెక్టర్ టి. రాహుల్ కుమార్ రెడ్డి, తాడేపల్లిగుడెం నియోజకవర్గం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ ప్రారంభించి ఆయా సరుకుల అమ్మకాలను మొదలుపెట్టారు.

సంబంధిత పోస్ట్