హిందువులపై మారణకాండకు నిరసనగా క్షీరారామంలో హోమం

69చూసినవారు
బంగ్లాదేశ్ లో హిందువుల పై జరుగుతున్న మారణ కాండకు నిరసన తెలియజేస్తూ సోమవారం పాలకొల్లు క్షీరారామంలో అభిషేక హోమాది కార్యక్రమాలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. శ్రీ గాయత్రీ స్మార్త పురోహిత సంఘం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. సంఘ అధ్యక్షులు బ్రహ్మశ్రీ తనికెళ్ళ శ్రీనివాస్, ములుకుట్ల రవీంద్ర, ముసునూరి ఫణి, ఆనంద్, గరిమెళ్ళ రాంబాబు, పెండ్యాల రామారావు, ఈరంకి కాశీ, శివకోటి కుమార్, సూరిబాబు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్