రూ.4లక్షల విలువైన నగలు తీసుకొని ప్రియుడితో పరారైన నవ వధువు.. షాక్ లో భర్త

67చూసినవారు
రూ.4లక్షల విలువైన నగలు తీసుకొని ప్రియుడితో పరారైన నవ వధువు.. షాక్ లో భర్త
రూ.4లక్షల విలువైన నగలు తీసుకుని ప్రియుడితో నవ వధువు పరారైంది. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో గ్వాలియర్‌లో చోటుచేసుకుంది. బాధితుడు సంతోష్ ప్రజాపతికి, అంజలికి 2 నెలల క్రితం వివాహమైంది. ఇటీవల సంతోష్ బయటి పనికి వెళ్లి, రెండు వారాల తర్వాత వచ్చేసరికి భార్య కనిపించలేదు. ఈక్రమంలో తన కూతురు ప్రియుడితో పారిపోయిందని అత్తగారి నుంచి కాల్ వచ్చింది. అనుమానం వచ్చి అల్మీరా తీసి చూడగా రూ. 4 లక్షల విలువైన నగలు, రూ.25,000 నగదు మాయమయ్యాయి. దీంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్