విజయవాడ వరద ముంపుకు కారణమైన బుడమేరు గట్లకు పడిన మూడు గండ్లను గత ఆరు రోజులుగా నిద్రాహారాలు మాని, గట్టుపైనే ఉంటూ గండ్ల పూడిక పనులు పూర్తి చేయించిన మంత్రి నిమ్మల రామానాయుడు ను రాష్ట్రవ్యాప్తంగా పలువురు అభినందిస్తున్నారు. శనివారం సన్మానించిన సహాచర మంత్రి కొల్లు రవీంద్ర, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకటరావు తదితరులు మంత్రిని కలిసి ప్రశంసించారు. అభినందించి కండువా వేసి సత్కరించారు.