పైడిపర్రులో భారీగా పందెం రాయుళ్లు అరెస్ట్

52చూసినవారు
తణుకు మండలం పైడిపర్రు స్పార్క్ హోటల్‌పై సోమవారం రాత్రి పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో పేకాట ఆడుతున్నట్లు వచ్చిన సమాచారంతో సీఐలు కొండయ్య, కృష్ణ కుమార్ 41 మందిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుల వద్ద నుంచి రూ. 1, 17, 020 నగదు, 41 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు తెలిపారు. హోటల్ యజమాని, టీడీపీ నేత సప్పారాజును అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.