ఆక్వా రైతులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలి

58చూసినవారు
కొల్లేరు వరదలు వల్ల వేలాది ఎకరాలు చేపలు, రొయ్యల చెరువులు ముంపునకు గురై నష్టపోయిన ఆక్వా రైతులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె. శ్రీనివాస్ డిమాండ్ చేశారు. శనివారం భీమడోలు సిఐటియు కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. వాతావరణ మార్పులు, కొల్లేరు వరదల వల్ల ఆక్వా రైతులకు వందల కోట్ల రూపాయలు నష్టం వాటిల్లిందని చెప్పారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్