ఆలయానికి 10వేలు విరాళం
పాలకొల్లు పట్టణ పరిధిలోని యడ్ల బజార్ లో కొలువైన పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయానికి ప్రసాదం కోసం జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులు రాయపూడి భవానీ శంకర్ ప్రసాద్ దంపతులు రూ. 10, 000 విలువ గల స్టీల్ ప్లేట్లు, స్టీల్ బకెట్లు అందజేశారు. ఈ మేరకు ఆలయ ప్రధాన అర్చకులు రమణ స్వామికి అందజేశారు. ప్రతి మంగళవారం భక్తులు, యాత్రికులకు పౌష్టికాహారం, జావా, ఇతర టిఫిన్స్ అందజేయడం పట్ల ఆలయ సిబ్బందిని అభినందించారు.