పిన్నెల్లి రాజకీయ భవితవ్యం ఏంటి?

22178చూసినవారు
పిన్నెల్లి రాజకీయ భవితవ్యం ఏంటి?
పోలింగ్ బూత్ లో ఈవీఎంను బద్దలుకొట్టి, విధ్వంసం సృష్టించిన వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి రాజకీయ భవిష్యత్తు అగమ్యగోచరంగా మారనుంది. ఈవీఎంను ధ్వంసం చేస్తూ ఎమ్మెల్యే నేరుగా పట్టుబడిన సాక్ష్యాధారాలు లభించడంతో ఈ వ్యవహారాన్ని కేంద్ర ఎన్నికల సంఘం తీవ్రంగా పరిగణించింది. పక్కా ఆధారాలు లభించడంతో శిక్ష పడటం ఖాయం. రెండేళ్లు జైలు శిక్ష పడితే ఎన్నికల్లో పోటీకి ఆరేళ్లపాటు అనర్హులవుతారని చట్ట నిబంధనలు చెబుతున్నాయి.