రోజూ తన కాన్వాయ్ను తనిఖీ చేస్తున్న పోలీసులకు ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించినట్లు కనిపించిందా అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అడిగారు. బుధవారం ట్విట్టర్ వేదికగా.. ‘నిబంధనలను అతిక్రమించి సీఎం జగన్ ఇంట్లోకి కంటెయినర్ వెళ్లింది. దాన్ని ఎందుకు తనిఖీ చేయలేదు. అందులో ఏముంది? బ్రెజిల్ సరుకా? మద్యంలో మెక్కిన రూ.వేల కోట్లా? ఏపీ సెక్రటేరియట్లో ఇన్నాళ్లు దాచిన దొంగ ఫైళ్లా? దీనికి డీజీపీ సమాధానం చెబుతారా?’ అని ప్రశ్నించారు.