ఈ నెల 26న ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించేందుకు వైసీపీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో సీఎం జగన్ మేనిఫెస్టోను విడుదల చేయనున్నారు. ఈసారి మేనిఫెస్టోలో మహిళలు, యువత, రైతులు, కార్మికులు, అవ్వాతాతలు, విద్యా సంక్షేమానికి పెద్దపీట వేసే ఛాన్సుంది. నవరత్నాలకు అప్గ్రేడెడ్ వెర్షన్లో వైసీపీ మేనిఫెస్టో ఉండబోతుందని సమాచారం.