ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి అధికార వైసీపీ శనివారం మేనిఫేస్టోను విడుదల చేసింది. ఈ మేనిఫేస్టోలో రైతులకు కీలక హామీని ప్రకటించింది. వైఎస్సార్ రైతు భరోసా పథకం కింద రైతన్నలకు అందిస్తున్న ఆర్థిక సాయం మొత్తాన్ని రూ.13,500 నుంచి రూ.16 వేలకు పెంచుతామని వెల్లడించింది. కౌలు రైతులకు కూడా రైతు భరోసా వర్తింపజేస్తామని తెలిపింది. మత్స్యకార భరోసా కింద ఐదు విడతల్లో రూ.50 వేలు అందజేస్తామని పేర్కొంది.