వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్కు బిగ్ షాక్ తగిలింది. గుంటూరు జిల్లా తాడేపల్లిలో నిర్మాణంలో ఉన్న వైసీపీ కేంద్ర కార్యాలయాన్ని సీఆర్డీఏ అధికారులు కూల్చివేస్తున్నారు. శనివారం తెల్లవారుజాము నుంచి భారీ పోలీస్ బందోబస్తు మధ్య బుల్డోజర్లు, ప్రొక్లెయినర్లతో కూల్చివేత పనులు మొదలుపెట్టారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు తాడేపల్లిలోని 2 ఎకరాల్లో పార్టీ కార్యాలయ నిర్మాణ పనులు ప్రారంభించింది. అయితే అక్రమ నిర్మాణంగా సీఆర్డీఏ అభ్యంతరం వ్యక్తం చేసింది.