వైసీపీ అధినేత వైఎస్
జగన్ అస్వస్థతకు గురయ్యారని వార్తలు వస్తున్నాయి. వైఎస్ఆర్ జిల్లా పులివెందులలో ఉన్న
జగన్ కాలు నొప్పితో బాధపడుతున్నారట. శనివారం కడప నుంచి పులివెందులకు వచ్చే సమయంలో ఎక్కువసేపు కార్యకర్తలతో సమావేశమైన క్రమంలో
వైసీపీ అధినేత కాలు బెనికిందని సమాచారం. ఎక్కువసేపు నిలబడటం వల్ల
జగన్ కాలుకు వాపు వచ్చిందట. దీంతో విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సలహా ఇచ్చినట్లు సమాచారం.