సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణ లోపం క్షమించరాని నేరం

78చూసినవారు
రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణ లోపం క్షమించరాని నేరమని కాంగ్రెస్ సీనియర్ నేత తులసిరెడ్డి మండిపడ్డారు. మంగళవారం వేంపల్లి లో ఆయన మాట్లాడుతూ సాగునీటి ప్రాజెక్టులను ఆధునిక దేవాలయాలని పండిట్ నెహ్రూ అభివర్ణించారన్నారు. గత వైకాపా ప్రాజెక్టుల నిర్వహణకు నిధులు విడుదల చేయని కారణంగా పులిచింతల, గుండ్లకమ్మ ప్రాజెక్టుల గేట్లు కొట్టుకు పోయాయన్నారు. ఈనెల 10న తుంగభద్ర డ్యాం 19వ గేటు కొట్టుకుపోయిందన్నారు.

సంబంధిత పోస్ట్