టెలికం దిగ్గజం ఎయిర్టెల్ మరో సరికొత్త, ఊహించని ప్లాన్ను ప్రకటించింది. తక్కువ రీఛార్జ్ ప్లాన్ల ట్రెండ్ను కొనసాగిస్తూ కేవలం రూ.9 తో ప్రత్యేక డేటా ఆఫర్ను ఆవిష్కరించింది. ఈ ప్లాన్లో ఏకంగా 10 జీబీ డేటా లభిస్తుంది. అయితే ప్లాన్ వ్యాలిడిటీ కేవలం 1 గంటలోనే ముగిసిపోతుంది. ఈ ప్లాన్ ఎఫ్యూపీ (ఫెయిర్ యూసేజ్ పాలసీ) పరిమితి 10జీబీగా ఉందని, ఆ తర్వాత స్పీడ్ 64 కేబీపీఎస్కు తగ్గిపోతుందని ఎయిర్టెల్ వివరించింది.